యాప్నగరం

టీఆర్ఎస్ మరింత బరితెగించింది.. విజయశాంతి ఘాటు విమర్శలు

Telangana Congress: దుబ్బాకలో ఎన్నికల కోడ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ దుష్ప్రయోగాలు చేస్తుందని విజయశాంతి ఆరోపించారు. గత కొన్నిరోజులుగా టీఆర్‌ఎస్‌ మరింత బరితెగించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 27 Oct 2020, 4:12 pm
దుబ్బాక ఎన్నికల ప్రచార వేళ టీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విజయశాంతి మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల కోడ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ దుష్ప్రయోగాలు చేస్తుందని ఆరోపించారు. గత కొన్నిరోజులుగా టీఆర్‌ఎస్‌ మరింత బరితెగించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
Samayam Telugu విజయశాంతి
Vijayashanti


‘‘దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆరెస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆరెస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? కాదా? అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి.’’ అని విజయశాంతి తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.