యాప్నగరం

KCR దొర ప్రాణ త్యాగాలకు చలించరు, బతికి సాధించుకోవాలి: విజయశాంతి

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ప్రాణత్యాగాలను రాజకీయాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. బతికి సాధించాలని ఆమె హితవు పలికారు.

Samayam Telugu 13 Oct 2019, 8:04 pm
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో.. ప్రభుత్వ తీరుతో మనస్థాపానికి గురైన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన.. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి భావోద్వేగంగా స్పందించారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని కేసీఆర్ గుర్తించలేదని.. సీఎం అయ్యాక ఆ విషయాన్ని గాలికి వదిలేశారని విజయశాంతి ఆరోపించారు.
Samayam Telugu kcr naveen1


ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరమని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

ప్రాణత్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్య అని.. వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైందని విజయశాంతి చురకలు అంటించారు. ‘‘ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే... బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చ’’న్నారు.

Read Also: మన ఓట్లకు పుట్టినోడిని.. కేసీఆర్‌పై కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణత్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే.. కేసీఆర్ స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని విజయశాంతి ఆరోపించారు. ‘‘సమ్మె ప్రభావం లేకుండా అన్ని ప్రత్యామ్నాయ చర్యలూ తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు తిరుగుతున్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా మరో వారం రోజుల పాటూ బడులకు దసరా సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

Read Also: ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ కన్నుమూత

నిజంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే, స్కూళ్లకు సెలవులు ఎందుకు పొడిగించారో వివరణ ఇవ్వాలి. టీఆర్ఎస్ సర్కారు వైఖరిని చూస్తుంటే.. మళ్లీ బస్సులు సజావుగా నడిచే వరకు పాఠశాలల సెలవులను పొడగిస్తారేమో అనే అనుమానం కలుగుతోంది. అదే గనుక జరిగితే పాఠశాలలకు దసరాకు మొదలైన సెలవులు సంక్రాతి వరకు కొనగాగుతాయేమో?’’ అని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.