యాప్నగరం

కాంగ్రెస్ రాజ్‌భవన్‌ ముట్టడిలో ఉద్రిక్తత.. పలువురు నేతలు అరెస్ట్

లుంబినీ పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. దీంతో వారిని లుంబినీ పార్క్ వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu 19 Jan 2021, 1:02 pm
రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు నిచ్చింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వాహించాలని తెలిపింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌ వద్ద ముందుగానే భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. లుంబినీ పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే కాంగ్రెస్‌ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవన్నారు పోలీసులు. లుంబినీ పార్క్‌ వద్ద పలువురు నేతలను అరెస్టు చేశారు.
Samayam Telugu రాజ్‌భవన్ ముట్టడి
raj bhavan


Read More: ఆన్‌లైన్ క్లాసుల కోసం... ఇంటి వద్దే చెట్టుకు ఉరేసుకున్న విద్యార్థిని
ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట కూడలి, రాజ్‌భవన్‌వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.