యాప్నగరం

నరహంతకుడు.. ఫార్మా స్కాం చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన వ్యక్తికి టీఆర్ఎస్ రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తుంది?: జగ్గారెడ్డి

Jagga Reddy Comments: టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాప‌కుడు పార్థసారథిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కరోనా సమయంలో రెమిడిసివర్ బ్లాక్ దందా నడిపారన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతోనే రెమిడిసివిర్ మాఫియా జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంజెక్షన్ రూ.లక్ష వరకు విక్రయించారని చెప్పుకొచ్చారు.

Authored byRaj Kumar | Samayam Telugu 23 May 2022, 2:05 pm
Samayam Telugu జగ్గారెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాప‌కుడు పార్థసారథిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్థసారథి నరహంతకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో రెమిడిసివర్ బ్లాక్ దందా నడిపారని ఆరోపించారు. ఆనాడు రెమిడిసివర్ దేశమంతా తిరిగిందని అన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతోనే రెమిడిసివిర్ మాఫియా జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంజెక్షన్ రూ.లక్ష వరకు విక్రయించారని అన్నారు. పార్థసారథి వద్ద దొరికిన రూ.500 కోట్లపై కేసు అయిందా.. లేదా.. అంటూ ఆయన ప్రశ్నించారు.

సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.. పార్థసారథిపై ఐటీ రైడ్‌లో ఏం జరిగిందో ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. ఐటీ రైడ్‌లో రూ.10 వేల కోట్ల వరకు బయటపడి ఉంటాయనే అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. పార్థసారథి ఫార్మా స్కాం చేశారని ఆరోపించారు. ప్రతి ఇంజక్షన్ రూ.లక్షకు అమ్మారని.. ఇంత పెద్ద స్కాం చేయడానికి పార్థసారథికి సిగ్గనిపిస్తలేదా అని ప్రశ్నించారు. పార్థసారథి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్‌ రాజ్యసభ సీటు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రెమిడిసివిర్ బాగోతం బయటపెడతామని ప్రకటించారు. అంతకుముందు శనివారం కూడా పార్థసారథిపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

‘పార్థసారథి కరోనా సమయంలో రెమిడిసివర్ తయారు చేసి ప్రజలను దోచుకున్నారు. ప్రజల రక్తాన్ని పీల్చి కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ పైసలతోనే కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని దుర్మార్గపు ఆలోచనలతోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు. ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ ఇవ్వొచ్చు..’ కదా అంటూ ప్రశ్నించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.