యాప్నగరం

హరీశ్ రావు మంత్రే కాదు, పెద్ద నీటి దొంగ.. ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

Sangareddy MLA: మంజీరా నీటిని అక్రమంగా తరలించి సంగారెడ్డి ప్రజల గొంతుకోశారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కలిసి మంత్రి హరీశ్ రావుకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.

Samayam Telugu 16 May 2020, 3:05 pm
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. ఆయన అసలు మంత్రే కాదని.. నీటి దొంగ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హరీశ్ రావు తీరుపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని అన్నారు. గతంలో హరీశ్ రావుకు ఎందుకు సన్మానం చేశారో తర్వాత చెబుతానని వ్యాఖ్యానించారు. ఆ సన్మాన సభలో కేసీఆర్‌ గురించి హరీశ్ రావు ఏమన్నాడో త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. మంజీరా నీటిని అక్రమంగా తరలించి సంగారెడ్డి ప్రజల గొంతుకోశారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కలిసి మంత్రి హరీశ్ రావుకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu హరీశ్ రావు (ఫైల్ ఫోటో)


శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు వల్లే 2017 నుంచి సంగారెడ్డి నియోజక వర్గంలో నీటి కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. అప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా ప్రజలు నీళ్ల కోసం ఆకాశం వైపు చూస్తున్నారని అన్నారు. ‌మంజీరా-సింగూరు డ్యామ్ నీళ్లను సంగారెడ్డి జిల్లాకు రానివ్వకుండా, ఇక్కడి ప్రజల బతుకులతో ఆడుకున్నారని విమర్శించారు. నారాయణ ఖేడ్- జోగిపేట్-పఠాన్ చెరు-జహీరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ కావడంతో సంగారెడ్డిలో నీళ్ల కరువు వచ్చింద‌ని మండిపడ్డారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని అన్నారు.

Also Read: స్టైల్ మార్చిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ దారిలో..Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.