యాప్నగరం

కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే

CM KCR | ఆర్టీసీ సమ్మె అంశంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్య పరిష్కరిస్తే సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానన్నారు. కేశవరావు, డీఎస్‌ పైనా హాట్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 23 Oct 2019, 8:10 pm
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కమిటీ వేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డిలో బుధవారం (అక్టోబర్ 23) ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu Jagga Reddy


కేశవరావు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పులిలా ఉండేవారని.. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత పిల్లిలా మారిపోయారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. డి శ్రీనివాస్‌ కూడా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గౌరవప్రదమైన స్థానం ఉండేదని.. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాక కనుమరుగయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

Must Read: ప్రగతి భవన్ ముట్టడి నిర్ణయం.. కాంగ్రెస్‌లో కాక

ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌ న్యాయమైంది కాబట్టే ప్రగతి భవన్‌ ముట్టడి, సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నట్లు జగ్గారెడ్డి వివరించారు. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌కు జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఉన్న స్వేచ్చ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉండదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతూ.. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తాయని, చెడు చేస్తే ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు.

Also Read: తప్పని తేలితే రేపే విధుల్లో చేరుతాం.. అశ్వత్థామరెడ్డి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.