యాప్నగరం

KCR అప్పుడు నన్ను చూసి నవ్వారు.. మరిప్పుడు.. ఎమ్మెల్యే సీతక్క సెటైర్లు

టీఆర్ఎస్ కరోనా మాస్కుల పంపిణీపై అదిరిపోయే సెటైర్లు వేశారు ఎమ్మెల్యే సీతక్క. ఎన్నికలు రావడంతో భారీగా నిధులు ఖర్చు చేసి మరీ టీఆర్‌ఎస్ సింబల్‌తో మాస్కులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.

Samayam Telugu 21 Oct 2021, 9:41 pm
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఊపందుకుంది. హోరాహోరీ తలపడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీకాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క హుజూరాబాద్‌ నియోజవర్గంలో దూసుకెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ మాస్కుల పంపిణీపై సీతక్క షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mulugu mla


కరోనా తొలినాళ్లలో పేదలకు కరోనా మాస్కులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని అడిగితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తనను చూసి నవ్వారని సీతక్క అన్నారు. సీఎం కేసీఆర్ సైతం హేళన చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ మాస్కులు పంపిణీ చేస్తున్నారని.. భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కేసీఆర్ బొమ్మలతో మాస్కుల పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ సర్కార్ విధానాలను గ్రహించి తెలివిగా ఓటేయాలని ఆమె కోరారు.



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.