యాప్నగరం

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత లేఖ

కౌలు రైతుల సమస్యలపై కోమటిరెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం అసలు కౌలు రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Samayam Telugu 29 Mar 2021, 7:22 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో కౌలు రైతులు పడుతున్న కష్టాలను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కౌలు రైతులు ఉరికొయ్యలకు వేలడాల్సిన పరిస్థితి నెలకొందని ఆ లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. పాక్‌ బుక్‌ ఉన్న రైతులకు అరకొర డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం.. కౌలు రైతులను అసలు పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు కౌలు రైతుకు గుర్తింపే లేదని మండిపడ్డారు కోమటిరెడ్డి.
Samayam Telugu congress mp komatireddy venkat reddy letter to cm kcr
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత లేఖ


కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయకపోవడంతో..వాళ్లు అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇక నుంచి అయినా... కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు కోమటిరెడ్డి. అలాగే మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.