యాప్నగరం

ఢిల్లీకి కోమటిరెడ్డి.. ఫైనల్ లిస్టులో ఆ ఇద్దరు నాయకులు

ఇప్పటికే కోమటిరెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియాతో భేటీ అయ్యారు. అయితే ఫైనల్ లిస్టులో ఇద్దరు నేతల పేర్లు ఉండటంతో మరోసారి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Samayam Telugu 22 Dec 2020, 11:23 am
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. పీసీసీ చీఫ్ రేసులో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నా.. హైకమాండ్ ఇప్పటికీ ఎవరు పేరును ఖరారు చేయలేదు. పలువురు నేతలు ఢిల్లీకి కూడా వెళ్లి .. సోనియాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తిన బాట పట్టారు. దీంతో పీసీసీ ఫైనల్ అయ్యిందనే వార్తలతో ఢిల్లీకి పయనం అయ్యారు కోమటిరెడ్డి. తన వంతుగా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షా పదవికి ఇప్పటికే ముగ్గురి పేర్లను పరిశీలించింది హైకమాండ్.
Samayam Telugu కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
komatireddy venkatreddy


Read More: ఆకలేస్తుందని ఇంటికి భోజనానికి వచ్చి... షాక్ ఇచ్చిన ఫ్రెండ్స్

అయితే ఫైనల్ లిస్టులో రేవంత్, భట్టి విక్రమార్క ఉన్నట్టు సమాచారం. అభిప్రాయ సేకరణలో రేవంత్‌కే ఎక్కువగా మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ల కోణంలో కోమటిరెడ్డి, భట్టి పేర్ల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 23 లేదా 26న పీసీసీ కొత్త చీఫ్ పై ప్రకటన ఉండే అవకాశం ఉంది. మాస్ ఫాలోయింగ్, అందర్నీ కలుపుకుపోయే వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉంది హైకమాండ్. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి... సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి ఢిల్లీ ప్రయత్నాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎవరి పేరు ప్రకటిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.