యాప్నగరం

‘కల్వకుంట్ల సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి.. ఇదో భారీ కుంభకోణం..’

Telangana కన్నా ఉత్తర్ ప్రదేశ్‌లో మద్యం వల్ల తక్కువ ఆదాయం వస్తోంది. యూపీ జనాభా 20 కోట్లపైనే ఉంటుంది. తెలంగాణలో ప్రజలు ఏం తలపెట్టినా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సి వస్తోందని విమర్శించారు.

Samayam Telugu 18 Dec 2019, 1:13 pm
రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని రేవంత్ ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జనాభా 20 కోట్లు దాటినా, అక్కడ మద్యం వల్ల వచ్చే ఆదాయం తెలంగాణ కన్నా తక్కువే ఉందని చెప్పారు. తెలంగాణలో ప్రజలు ఏం తలపెట్టినా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్‌ను (కేఎస్‌టీ) అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘6 కేసీఆర్ లక్కీ నెంబర్. కేఎస్‌టీ కూడా ఆరు శాతమే. కమీషన్లు ఎక్కువగా వచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారు.’’ అని రేవంత్ ఆరోపించారు.
Samayam Telugu Revanth Reddy


తాజాగా పెరిగిన మద్యం ధరల పెంపు వెనుక కూడా ఈ కేఎస్‌టీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఓ టీఆర్ఎస్ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చినట్లు ఆరోపణలు చేశారు. ‘‘మద్యం ధరల పెంపు భారీ కుంభకోణం, కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలి. లేదంటే మేం కోర్టును ఆశ్రయిస్తాం’’ అని రేవంత్ రెడ్డి ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో హెచ్చరించారు.

Also Read: ‘దిశ’లాగే.. 9 మంది మహిళలను.. నిందితుల గురించి విస్మయకర వాస్తవాలు వెల్లడించిన పోలీసులు

మద్యం ధరలు తగ్గించాలి
మద్యం ధరల విషయంలో అతి ఉత్పత్తి అవుతున్న వ్యయం కంటే, అత్యధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారని రేవంత్ లేఖలో ప్రశ్నించారు. పెంచిన ధరల నేపథ్యంలో వినియోగదారుల ఫోరం కూడా నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు లాటరీ జూదం లాంటిదన్న కేసీఆర్.. ఇప్పుడు అదే లాటరీ పద్ధతిలో మద్యం షాపులెలా కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. లాటరీలో షాపు దక్కని దరఖాస్తుదారుడుకి చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం సరికాదని సూచించారు. పెంచిన మద్యం ధరలను తక్షణం నిలిపేయాలని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

Also Read: ఈఎస్‌ఐ దేవికారాణి ఆస్తుల చిట్టా.. అమరావతిలో 9 ప్లాట్లు గుర్తింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.