ఎల్లమ్మపై ఒట్టేస్తారా ? కేటీఆర్ను ఛాలెంజ్ చేసిన రేవంత్
రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ను కేటీఆర్ దత్తత తీసుకున్నారు. అయితే ఆయన దత్తత తీసుకున్నాక కొడంగల్కు ఒక్క కొత్త పథకం కూడా రాలేదన్నారు రేవంత్.
Samayam Telugu 25 Jan 2021, 6:38 am
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన దైన స్టైల్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తూ... అరెస్ట కూడా అవుతుంటారు.ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ మరోసారి అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్కు సంబంధించి పలు వ్యాఖ్యలు చేస్తూ... మంత్రి కేటీఆర్కు సవాల్ చేశారు. కొడంగల్ అభివృద్ధి తన టైమ్లోనే జరిగిందన్నారు రేవంత్ రెడ్డి.
తన హయాంలోనే కొడంగల్ ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులకు రంగులు వేసి తమవిగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్కు ఒక్క కొత్త పథకం కూడా రాలేదని విమర్శించారు. కొడంగల్కు కొత్త పథకం వచ్చినట్లు పోలేపల్లి ఎల్లమ్మ మీద ఒట్టేసి ఆధారాలు చూపిస్తారా? అని కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. మరి రేవంత్ విసిరిన ఈ ఛాలెంజ్ను కేటీఆర్ స్వీకరిస్తారా ? లేదో చూడాల్సిందే.
Read More: ఇది కేసీఆర్ కలల ప్రాజెక్టు.. అద్భుత వీడియో విడుదల చేసిన కేటీఆర్
2018 అసెంబ్లీ ఎన్నికలు.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపిస్తే.. తాను దత్తత తీసుకొని సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ హామీ మేరకు కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. హామీ నెరవేర్చడంలో భాగంగా నియోజకవర్గంలో రూ.297 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కొడంగల్లో మినీ స్టేడియం నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని సంబంధితశాఖలను మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కొత్త మండలాల ఏర్పాటుకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరి దీనిపై రేవంత్ ఏమంటారో చూడాలి.
తన హయాంలోనే కొడంగల్ ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులకు రంగులు వేసి తమవిగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్కు ఒక్క కొత్త పథకం కూడా రాలేదని విమర్శించారు. కొడంగల్కు కొత్త పథకం వచ్చినట్లు పోలేపల్లి ఎల్లమ్మ మీద ఒట్టేసి ఆధారాలు చూపిస్తారా? అని కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. మరి రేవంత్ విసిరిన ఈ ఛాలెంజ్ను కేటీఆర్ స్వీకరిస్తారా ? లేదో చూడాల్సిందే.
Read More: ఇది కేసీఆర్ కలల ప్రాజెక్టు.. అద్భుత వీడియో విడుదల చేసిన కేటీఆర్
2018 అసెంబ్లీ ఎన్నికలు.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపిస్తే.. తాను దత్తత తీసుకొని సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ హామీ మేరకు కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. హామీ నెరవేర్చడంలో భాగంగా నియోజకవర్గంలో రూ.297 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కొడంగల్లో మినీ స్టేడియం నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని సంబంధితశాఖలను మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కొత్త మండలాల ఏర్పాటుకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరి దీనిపై రేవంత్ ఏమంటారో చూడాలి.