యాప్నగరం

ప్రగతి భవన్‌లో కుక్కకు ఉన్న విలువ మనుషులకి లేదా: రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్‌లో శునకం మృతి - వైద్యులపై కేసు నమోదు అంశంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బంగారు తెలంగాణలో ఓ కుక్కకు ప్రాణాలకు ఉన్న విలువ మనుషులకు లేదా అని ప్రశ్నించారు.

Samayam Telugu 14 Sep 2019, 5:52 pm
ప్రగతి భవన్‌లో ఓ కుక్కకు ఉన్న విలువ బంగారు తెలంగాణలో మనుషులకి లేకుండా పోయిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం (సెప్టెంబర్ 14) ట్విటర్ వేదికగా ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జ్వరంతో ఓ శునకం మృతి చెందడం, ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేసిన ఘటనను ప్రస్తావించారు.
Samayam Telugu revanth reddy


ప్రగతి భవన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 10) పదకొండు నెలల హస్కీ అనే కుక్క మరణించింది. శునకం మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసు కేసు నమోదైంది. ఎంపీ రేవంత్ ఈ ఘటనను తన విమర్శనాస్త్రంగా వినియోగించుకున్నారు.

Also Read: ప్రగతి భవన్‌లో శునకం మృతి.. డాక్టర్లపై కేసు నమోదు

‘ప్రగతి భవన్‌లో కుక్కకు ఉన్న విలువ బంగారు తెలంగాణలో మనుషులకి లేదా?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 14) ఓ ట్వీట్ చేశఆరు. తెలంగాణ సీఎంవో, ఆరోగ్య శాఖను ట్యాగ్ చేశారు.

Watch: మెట్రో రైల్లో మందుబాబు హంగామా.. మహిళల ముందు అనుచిత ప్రవర్తన

రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చికిత్స అందించలేక వైద్యులు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డెంగ్యూతో గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే ఆరుగురు చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. మరోవైపు.. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రులు ప్లేట్‌లెట్ల పేరుతో పేషంట్ల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.