యాప్నగరం

AICC: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబాట... నేడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు

నిత్యావసర ధరలు, చమురు ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆందోళణ కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 5 Aug 2022, 7:46 am
కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆందోళన బాట పట్టింది. ఏఐసీసీ(AICC) పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాటు చేపట్టనుంది. ఈ కార్యక్రమ వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ గురువారం ప్రకటించారు.
Samayam Telugu Congress Party


హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల ధర్నా చేపట్టేందుకు అనుమతి కోరామని మహేశ్వరర్‌రెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ‘ఛలో రాజ్‌భవన్’ చేపడతామని తెలిపారు. చమురు ధరలు, నిత్యావసర ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్, నిరుద్యోగం, తెలంగాణ వరదల బీభత్సం, ఇతర ప్రజా సమస్యలపై ఏఐసీసీ పిలుపులో భాగంగా ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.