యాప్నగరం

కరోనాతో మరో కాంగ్రెస్ నేత మృతి

కరోనా సోకడంతో ఆయన గత కొద్ది రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి బుధవారం మరణించారు.

Samayam Telugu 29 Apr 2021, 9:10 am
కాంగ్రెస్‌ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో మరో సీనియర్ నేత కన్నుమూశారు. హైాదరాబాద్ గోషామహల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎస్‌పీ గిరి బుధవారం ఉదయం మృతిచెందారు. కరోనా వైరస్‌ సోకడంతో ఆయన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu కరోనాతో కాంగ్రెస్ నేత మృతి


ఎస్‌వీ గిరి మాజీ మంత్రి దివంగత ముఖేశ్‌గౌడ్‌‌కు అత్యంత సన్నిహితుడు. బుధవారం సాయంత్రం బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి వివిధ పార్టీల నాయకులు గిరికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అంత్యక్రియల్లో స్థానికంగా ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.