యాప్నగరం

జగన్.. తొందరపడకు, మీనాన్నలా మంచిపేరు తెచ్చుకో: వీహెచ్

AP High Court: నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని సూచించారు. ఈ వ్యవహారంలో పంతానికి పోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎఈసీ స్థానంలో కొనసాగించి జగన్ మంచిపేరు తెచ్చుకోవాలని హితవు పలికారు.

Samayam Telugu 29 May 2020, 5:31 pm
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు పెద్ద షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశింది. అయితే, తాజాగా ఈ తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) స్పందించారు. ఈ వ్యవహారంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధితో శుక్రవారం హైదరాబాద్‌లో వీహెచ్ మాట్లాడారు.
Samayam Telugu వీహెచ్, జగన్ (ఫైల్ ఫోటోలు)
VH, Jagan


నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని సూచించారు. ఈ వ్యవహారంలో పంతానికి పోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎఈసీ స్థానంలో కొనసాగించి జగన్ మంచిపేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ నిర్ణయాలతో ఆయన నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బ తీయవద్దని మంచి మాటలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను తొలగించడంతోనే వివాదం మొదలైందని గుర్తు చేశారు.

Must Read: ప్లాస్టిక్‌తో పాల తయారీ, అమ్మకం.. దిమ్మతిరిగేలా కల్తీ.. సంచలన గుట్టు వెలుగులోకి

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.