యాప్నగరం

పువ్వాడ.. కులం పరువు తీయొద్దు.. సీనియర్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

రెండు రాష్ట్రాల్లో కమ్మ సామాజికవర్గం నుంచి తానొక్కడినే మంత్రిగా మిగిలానని.. కొందరు సూడో చౌదర్లు కుటిల రాజకీయ నేతలతో కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ రాజేశాయి.

Samayam Telugu 23 Apr 2022, 6:29 pm
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ కేసులు బనాయించి.. రౌడీషీట్ ఓపెన్ చేయించడంతో వేధింపులు భరించలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఖమ్మంలో చిన్న విషయం జరిగితే తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించడం మరింత హీట్ రాజేస్తున్నాయి.
Samayam Telugu puvvada


తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడినే కమ్మ సామాజికవర్గం నుంచి మంత్రిగా మిగిలానని.. తనపై కుట్రలు చేస్తున్నారంటూ మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఘాటుగా స్పందించారు. గాంధీభవన్‌ వద్ద మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ కౌన్సిలర్లను పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కులం పేరు చెప్పడానికి పువ్వాడకి సిగ్గనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

కమ్మ కులం పరువు తీయొద్దని జగ్గా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదో చిన్న విషయం రిగిందని మంత్రి పువ్వాడ మాట్లాడుతున్నారని.. అసలు ఆయనకు బుర్ర ఉందా? అని జగ్గా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడది మాత్రమే కమ్మ కులం కాదని.. ఆత్మహత్య చేసుకున్న సాయిది కూడా అదే కులమని ఆయన అన్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి మంత్రి పువ్వాడను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఖమ్మంలో పువ్వాడ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.