తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయనీ, వీటిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై ఆరోపణలు చేశారు. సమైక్య రాష్ట్రంలో 65 ఏళ్లలో విద్యుత్ శాఖ 20 వేల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో నాలుగున్నరేళ్లలోనే 74 వేల కోట్లు అప్పు అయ్యిందని ఆరోపించారు.
విద్యుత్ కొనుగోళ్లపై ప్రభాకర్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కొనుగోళ్లకు సంబంధించి గణాంకాలతో సహా విడుదల చేస్తున్నానని, ప్రభాకర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే, వివరాలపై స్పందించాలని సవాల్ విసిరారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్లను సీఎండీలుగా నియమించేవారని తెలిపారు.
Read Also: నిజాయతీగా పని చేసినందుకే ఏసీబీ కేసులు: రిటైర్డ్ సీఐ సంచలన వ్యాఖ్యలు
ఐఏఎస్లు అడ్డగోలు ఒప్పందాలపై సంతకాలు పెట్టకపోవడంతో వారిని తొలగించి రిటైర్డ్ అధికారులను నియమించారని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే రఘుమారెడ్డి, గోపాల్ రావు, ప్రభాకర్ రావు అనే ముగ్గురు రిటైర్డ్ అయిన, ఎలాంటి అర్హత లేని అధికారులను అత్యంత కీలకమైన పదవిలో నియమించి విద్యుత్ శాఖను అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు.
అర్హతలేని ప్రభాకర్రావు కింద పనిచేయలేక ఐఏఎస్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెడుతున్నారని విద్యుత్ జేఏసీ నేత రఘును మీడియా ముందు మాట్లాడకుండా ఆంక్షలు విధించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. తన వివరాల్లో తప్పులు ఉంటే రఘు లాంటి నిపుణులు ఖండించేవారని తెలిపారు.
Read also: ‘కేసీఆర్ పెద్ద సన్నాసి.. అభివృద్ధికి దరిద్రుడిగా మారాడు’
విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణ చేయించాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ .. కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్లకు బీజేపీలో స్థానం లేదన్నారు.
విద్యుత్ కొనుగోళ్లపై ప్రభాకర్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కొనుగోళ్లకు సంబంధించి గణాంకాలతో సహా విడుదల చేస్తున్నానని, ప్రభాకర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే, వివరాలపై స్పందించాలని సవాల్ విసిరారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్లను సీఎండీలుగా నియమించేవారని తెలిపారు.
Read Also: నిజాయతీగా పని చేసినందుకే ఏసీబీ కేసులు: రిటైర్డ్ సీఐ సంచలన వ్యాఖ్యలు
ఐఏఎస్లు అడ్డగోలు ఒప్పందాలపై సంతకాలు పెట్టకపోవడంతో వారిని తొలగించి రిటైర్డ్ అధికారులను నియమించారని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే రఘుమారెడ్డి, గోపాల్ రావు, ప్రభాకర్ రావు అనే ముగ్గురు రిటైర్డ్ అయిన, ఎలాంటి అర్హత లేని అధికారులను అత్యంత కీలకమైన పదవిలో నియమించి విద్యుత్ శాఖను అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు.
అర్హతలేని ప్రభాకర్రావు కింద పనిచేయలేక ఐఏఎస్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెడుతున్నారని విద్యుత్ జేఏసీ నేత రఘును మీడియా ముందు మాట్లాడకుండా ఆంక్షలు విధించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. తన వివరాల్లో తప్పులు ఉంటే రఘు లాంటి నిపుణులు ఖండించేవారని తెలిపారు.
Read also: ‘కేసీఆర్ పెద్ద సన్నాసి.. అభివృద్ధికి దరిద్రుడిగా మారాడు’
విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణ చేయించాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ .. కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్లకు బీజేపీలో స్థానం లేదన్నారు.