యాప్నగరం

సిరిసిల్ల జిల్లాలో అవిభక్త కవలలు.. కడుపు అతుక్కొని పుట్టిన పిల్లలు

ముస్తాబాద్‌కు చెందిన దంపతులకు కవల ఆడపిల్లలు పుట్టారు. అయితే వారిద్దరూ అతుక్కొని పుట్టడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 19 Oct 2020, 8:56 am
కవలలు జన్మించడం అనేది చాలా అరుదుగా జరిగే ఘటన. కొందరికీ ఆరోగ్యకరమైన ట్విన్స్ జన్మిస్తుంటారు. అయితే కొందరికీ మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉన్న కవలలు పుడుతుంటారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్‌కు చెందిన చెవుల శిరీష, వెంకటేశ్‌ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. మూడోసారి గర్భందాల్చిన శిరీషకు ప్రస్తుతం ఎనిమిదినెలలు, శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ముస్తాబాద్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు.
Samayam Telugu అవిభక్త కవలలు జననం
twins birth


దీంతో వైద్యులు శిరీషకు స్కానింగ్‌ చేశారు. ఆమె కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. అయితే కడుపులో ఇద్దరు ఆడ శిశువులు అవిభక్తంగా ఉన్నారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కుని ఉంది. కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని శిరీషకు వైద్యం చేసిన డాక్టర్‌ అనూష తెలిపారు. అవిభక్త కవలిలద్దరూ ఈ కవలలు రెండు కిలోల బరువుతో జన్మించగా.. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని పిల్లల ఆస్పత్రికి తరలించారు.

Read More: సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం

అయితే అవిభక్త కవలలను చూసిన వారి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవల పిల్లలు పుట్టారని ఆనందించాలో... ఇలా అవిభక్తంగా పుట్టినందుకు బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే వీణా వాణి అనే అవిభక్త కవలు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. వీణావాణి ఇద్దరూ 2003 సంవత్సరంలోపుట్టారు. వారి శరీరాలు వేరుగా ఉన్నా, తల భాగం మాత్రం కలిసే ఉంది. వారి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మి మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.