యాప్నగరం

కుక్కలను తప్పించబోయి.. కానిస్టేబుల్‌ మృతి

వీధి కుక్కలను తప్పించబోయి ఓ కానిస్టేబుల్ ప్రమాదానికి గురయ్యారు. తలకు బలమైన గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 13 Apr 2020, 4:22 pm
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విధులను ముగించుకొని అర్ధరాత్రి బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్.. వీధి కుక్కలను తప్పించపోయి కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఏప్రిల్ 13) మరణించారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మామిడి రాజు గత గురువారం (ఏప్రిల్ 9) ప్రమాదానికి గురయ్యారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు ఆయణ్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu cop death


కానిస్టేబుల్ రాజు భార్య నిండు గర్భవతి. అతడికి 2017లో వివాహమైంది. రాజు మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతితో పోలీసు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. లాక్‌డౌన్‌ సందర్భంగా రాజు నిర్వహించిన విధులను గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.