యాప్నగరం

తెలంగాణలో 1610 కరోనా కేసులు.. మరో హైదరాబాద్‌గా వరంగల్!

తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వరంగల్ అర్బన్‌లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Samayam Telugu 28 Jul 2020, 8:44 am
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటకలతో పోలిస్తే తక్కువగా నమోదవుతున్నా.. జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సోమవారం ఒక్క రోజే తెలంగాణలో 1610 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 57,142కు చేరింది. సోమవారం 803 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 42,909 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 75 శాతం దాటింది.
Samayam Telugu coronavirus


సోమవారం తెలంగాణలో 15,839 శాంపిళ్లను పరీక్షించగా.. 1610 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలగా.. మరో 809 శాంపిళ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 480కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.84 శాతంగా ఉంది. జాతీయ సగటు 2.26 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ. కానీ ఇతర అనారోగ్య సమస్యలు ఉండి.. కరోనా సోకి చనిపోయిన వారిని కరోనా మరణాల జాబితాలో చేర్చడం లేదని ఆరోగ్య మంత్రి ఈటల తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 531 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ జిల్లాలో 152, మేడ్చల్ జిల్లాలో 113, సంగారెడ్డి జిల్లాలో 74, నిజామాబాద్ 58, పెద్దపల్లి 48, కరీంనగర్ 48, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, ఖమ్మం జిల్లాలో 26 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Read Also: కరోనా దెబ్బకు ‘చితి’కి బతుకులు.. డిగ్రీలు చదివి కాటికాపరులుగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.