యాప్నగరం

కరోనా రోగి మరో వీడియో వైరల్.. ఏకంగా మంత్రి ఈటలకు ఫోన్ చేసి..

Hyderabad Coronavirus: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందడం లేదని, కొన్ని చోట్ల రోగులు వైద్యుల నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Samayam Telugu 6 Jul 2020, 7:40 pm
తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు సంబంధించి ఇటీవల కొన్ని వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ కొంత మంది వీడియోలో రికార్డు చేసి సన్నిహితులకు పంపారు. తాజాగా మరో కరోనా బాధితుడి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే, తనకు ఊపిరి ఆడటం లేదంటూ కరోనా బాధితుడు ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నేరుగా ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu కరోనా రోగి మరో వీడియో వైరల్.. ఏకంగా మంత్రి ఈటలకు ఫోన్ చేసి..
health Minister Etela Rajender


ఆ బాధితుడు చేసిన ఫోన్‌తో వెంటనే స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ తన పీఏతో ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేయించినట్లుగా సమాచారం. బాధిత వ్యక్తికి సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. మంత్రి వెంటనే స్పందించడంపై కరోనా బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాణాలు కాపాడిన దేవుడు మంత్రి ఈటల అని అభినందించారు. ఒకే ఒక్క ఫోన్ తన ప్రాణాలు కాపాడిందని అతను ఆనందం వ్యక్తం చేశాడు. తనకు అందిన సాయాన్ని బాధితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Also Read: undefinedundefined
మరోవైపు, రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందడం లేదని, కొన్ని చోట్ల రోగులు వైద్యుల నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలోని వీడియోలు, ఛాతీ ఆస్పత్రిలో ఓ పాతికేళ్ల యువకుడు తన తండ్రికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ బాధపడడం వంటి వీడియోలతో ఈ విమర్శలు మరింతగా పెరిగాయి. జర్నలిస్టు మనోజ్ మృతి చెందడం మొదలు వైద్యుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతూ ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపుతున్న సంగతి తెలిసిందే.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.