యాప్నగరం

ఐసోలేషన్‌ వార్డు డాక్టర్లపై మళ్లీ దాడి.. మంత్రి ఈటల సీరియస్

Coronavirus Hyderabad Updates: ఇద్దరు కరోనా సోకిన వ్యక్తుల వద్ద ఉన్న తన కొడుకు ఇక్కడే ఉండడం సబబు కాదని ఇంటికి తీసుకు వెళతానని డాక్టర్లను అతను బతిమాలాడు. పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో నా కొడుకును ఇంటికి తీసుకుపోతానంటే వైద్యులు వద్దంటున్నారని అతను వారించాడు.

Samayam Telugu 14 Apr 2020, 6:24 pm
హైదరాబాద్‌లో మళ్లీ కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలోని కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులో పీజీ డాక్టర్లపై ఈ దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాళ్ళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులు ఉన్న వార్డులోనే మరో కరోనా అనుమానితుడు కూడా ఉన్నాడు. ఇతడి తండ్రి తన కొడుకుని ఇంటికి తీసుకువెళతానని పట్టుబట్టాడు. ఐసోలేషన్ వార్డులోని డాక్టర్లు వద్దని వారించారు. ఈ సమయంలో ఇంటికి తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదని వివరించారు.
Samayam Telugu corona_14_20200317_402_602


Also Read: undefined

ఇద్దరు కరోనా సోకిన వ్యక్తుల వద్ద ఉన్న తన కొడుకు ఇక్కడే ఉండడం సబబు కాదని ఇంటికి తీసుకు వెళతానని డాక్టర్లను అతను బతిమాలాడు. పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో నా కొడుకును ఇంటికి తీసుకుపోతానంటే వైద్యులు వద్దంటున్నారని అతను వారిస్తున్నాడు. నివేదికలు వచ్చేవరకు ఉండాలని వైద్యులు చెప్పారు. దీంతో పేషెంట్ తండ్రి, వైద్యుల మధ్య వాదోపవాదాలు జరిగి చివరకు ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పీజీ డాక్టర్ల‌పై కరోనా అనుమానితుడి తండ్రి దాడి చేశాడు. చివరకు పోలీసులు వచ్చి అన్ని వివరంగా వివరించడంతో అన్వర్ తండ్రి డాక్టర్లకు క్షమాపణలు చెప్పాడు.

స్పందించిన మంత్రి
ఉస్మానియా ఆస్పత్రి ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెడెంట్‌తో మాట్లాడారు. అక్కడ ఉన్న సమస్యను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని మంత్రి కోరారు. డాక్టర్లపై దాడి సరికాదన్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.