యాప్నగరం

కొడుకును కరోనా బలితీసుకుందని.. మనోవేదనతో తల్లి మృతి

కోవిడ్ మహమ్మారి కొడుకును బలితీసుకోగా.. కుమారుడు చనిపోయాడనే బెంగతో వృద్ధురాలైన తల్లి నిద్రలోనే కన్నుమూసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో చోటు చేసుకుంది.

Samayam Telugu 19 Jun 2020, 8:01 am
కరోనా వైరస్ కారణంగా కుమారుడు చనిపోగా.. తీవ్ర మనోవేదనకు లోనైన అతడి తల్లి మూడు రోజుల వ్యవధిలోనే మరణించిన విషాద ఘటన హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వినాయక నగర్‌కు చెందిన హోంగార్డ్ ఇటీవల కరోనా బారిన పడగా.. చికిత్స పొందుతూ జూన్ 15న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి భార్య, తల్లి, ముగ్గురు పిల్లలకు చార్మినార్ యునాని హాస్పిటల్‌లో కరోనా టెస్టులు చేయగా రిపోర్టులు ఇంకా రాలేదు.
Samayam Telugu కరోనా టెస్ట్
coronavirus test


కళ్ల ముందే కొడుకు చనిపోయాడనే బాధతో 75 ఏళ్ల వృద్ధురాలైన అతడి తల్లి కూడా కన్నుమూసింది.. బుధవారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఆమె.. నిద్రలోనూ చనిపోయింది. కరోనాతో కుమారుడు చనిపోవడం, మూడు రోజుల్లోనే అతడి తల్లి కూడా మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోగా.. కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.