యాప్నగరం

కిడ్నీ సమస్యతో వస్తే కరోనా చికిత్స.. ఆస్పత్రి ఎదుట బాధితుడి తల్లి ఆందోళన

Secunderabad: ఆస్పత్రి ఇప్పటికే రూ.4 లక్షలు కట్టించుకుందని, కిడ్నీకి సంబంధించిన చికిత్స చేయకుండా ఇప్పుడు కరోనా సోకిందని చెబుతున్నారని బాధితుడి తల్లి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

Samayam Telugu 5 Aug 2020, 3:05 pm
కిడ్నీలు విఫలమై ఆస్పత్రికి వస్తే కరోనా వైరస్ సోకిందని చికిత్స చేశారని సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేటు ఆస్పత్రి ఎదుట ఓ రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తొలుత బాధితుడికి కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పారని, మూత్రపిండాన్ని దానం చేస్తే పూర్తిగా నయం చేయొచ్చని చెప్పారని కుటుంబ సభ్యులు వాపోయారు. తాను ఓ కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని బాధితుడి తల్లి చెప్పారు. ఈ చికిత్స కోసం ఇప్పటికే రూ.4 లక్షలు కట్టించుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడు కరోనా సోకిందని చెబుతున్నారని ఆమె ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి వ్యవహారం సరిగ్గా లేదంటూ సిబ్బందిపై ఆరోపణలు చేశారు. రూ.5 లక్షలు కడితేనే రోగిని చూసేందుకు అనుమతిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన
corona treatment to kidney patient, relatives protest in front of hospital


జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వీరు నిరుపేదలని, అలాంటి వారి నుంచి రూ.లక్షల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆ కుటుంబంలోని మరో వ్యక్తి ఆరోపించారు. ఇప్పటికే కట్టిన రూ.4 లక్షలు కూడా అప్పు చేసి తెచ్చినట్లు వివరించారు. కిడ్నీలు విఫలమైన వ్యక్తికి ఉన్నట్టుండి కరోనా సోకిందని చెబుతున్నారని, బాధితుడిని తల్లి చూసేందుకు కూడా అనుమతివ్వడం లేదంటూ ఆందోళన చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.