యాప్నగరం

తెలంగాణలో రెడ్, గ్రీన్ జోన్లు ఇవే.. మనమే దేశానికి దిక్సూచీ: కేసీఆర్

Telangana Coronavirus: ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్లో ఉన్న రెండు మూడు జిల్లాలు కూడా త్వరలో గ్రీన్ జోన్‌ కిందకు మారిపోతాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Samayam Telugu 6 May 2020, 1:10 am
కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు, కేసులున్న ప్రాంతాలను బట్టి కేంద్ర ప్రభుత్వం జిల్లాలను మూడు రకాల జోన్లుగా విభజించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. మంగళవారం రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ చర్చ అనంతరం సీఎం లాక్ డౌన్‌ను మే 29 వరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా విషయంలో తెలంగాణ గడ్డన పడిందని.. కానీ ఇంకా ప్రజలు స్వీయ నిర్భందంలోనే ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
Samayam Telugu కేసీఆర్


కరీంనగర్‌లో కంటైన్మెంట్ విధించిన తీరుతో దేశానికే మనం ఓ రోల్ మోడల్ అయ్యాయమని వెల్లడించారు. కేరళ అధికారులు కూడా ఈ విధానాన్ని అనుసరించినట్లుగా కేసీఆర్ చెప్పారు. అంతకుముందు అసలు దేశంలో కంటైన్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎంతో మిన్నగా ఉందని వివరించారు. తెలంగాణలోని 6 రెడ్, 18 ఆరెంజ్, 9 గ్రీన్ జోన్ల వివరాలను కేసీఆర్ వెల్లడించారు.

Must Read: పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ కీలక ప్రకటన

రెడ్‌ జోన్ జిల్లాలు:
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు:
నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల.

గ్రీన్‌ జోన్ జిల్లాలు:
పెద్దపెల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి

Also Read: undefined

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి ప్రాంతాలు అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలని, ఇక్కడ మిగిలిన వాటితో పోలిస్తే ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని కేసీఆర్ తేల్చి చెప్పారు. కరోనా వల్ల రాష్ట్రంలో చనిపోయిన వారు 29 మందిలో కూడా మొత్తం 26 మంది ఈ జిల్లాల నుంచే ఉన్నారని కేసీఆర్ చెప్పారు. అంతేకాక, ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్లో ఉన్న 18 జిల్లాలు కూడా రానున్న 11 రోజుల్లో గ్రీన్‌జోన్‌లోకి మారనున్నట్లు కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జోన్ల వారీగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిందని.. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.