జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్లో 500కిపైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హై రిస్క్ జోన్లుగా ప్రకటించిన తెలంగాణ సర్కారు.. ఈ ఏరియాలకు నోడల్ ఆఫీసర్లను నియమించింది. యూసుఫ్ గూడ, చార్మినార్, రాజేంద్ర నగర్, కార్వాన్, మెహిదీ పట్నం, అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, కుత్బుల్లాపూర్ ప్రాంతాలు హై రిస్క్ జోన్లుగా ఉండగా.. ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడి బాధ్యతను నోడల్ ఆఫీసర్లు తీసుకోనున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారికి వైద్య సేవలు సరిగా అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఏ ప్రాంతంలోనైనా కరోనా కేసులు ఎక్కువా నమోదైతే.. దాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించనున్నారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి షాపులు, ఇతర వ్యాపార కార్యకలాపాలను నిర్దిష్ట సమయం వరకే తెరవడానికి అనుమతిస్తున్నారు.
ఏ ప్రాంతంలోనైనా కరోనా కేసులు ఎక్కువా నమోదైతే.. దాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించనున్నారు. ఆ ప్రాంతంలో రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి షాపులు, ఇతర వ్యాపార కార్యకలాపాలను నిర్దిష్ట సమయం వరకే తెరవడానికి అనుమతిస్తున్నారు.