యాప్నగరం

కరోనా విజృంభణ: తెలంగాణలో మరో రెండు కేసులు.. 21కి చేరిన సంఖ్య

Coronavirus cases in Telangana: మరోవైపు, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ మూసివేత 29 వరకూ అమలులో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Samayam Telugu 21 Mar 2020, 4:21 pm
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో 19కి చేరిన కరోనా రోగుల సంఖ్య, తాజా కేసులతో 21కి చేరింది. బాధితుల్లో 11 మంది విదేశీయులు కాగా, మరో 8 మంది భారతీయులు ఉన్నారు. 21 మందిలో మొదటి కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి కోలుకోవడంతో అతణ్ని డిశ్చార్జి చేశారు. కరోనా సోకిన ఇండోనేసియాకు చెందిన వ్యక్తుల్లో ఓ 60 ఏళ్ల పైబడిన వ్యక్తికి కాస్త అధికంగా నియోనియా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu coronavirus-docs-india-pti


మరోవైపు, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ మూసివేత 29 వరకూ అమలులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చే అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. కేంద్రం ఆదేశాలతోనే విమానాల సర్వీసులను రద్దు చేసినట్లుగా ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు.

Must Read: కరోనా వైరస్‌ను సబ్బు ఎలా చంపుతుందో చూడండి.. రాచకొండ పోలీస్ వీడియో వైరల్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటివరకూ 258 నమోదు కాగా, వీరిలో 39 మంది విదేశీయులు ఉన్నారు. దేశంలోనే శుక్రవారం ఒక్కరోజే 55 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే, కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారు 23గా ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య 4గా ఉంది.

Also Read: రైల్లో కరోనా అనుమానిత జంట.. కాజీపేటలో నిలిపివేత, ప్రయాణికుల్లో ఆందోళన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.