యాప్నగరం

క్వారంటైన్ నుంచి తప్పించుకున్న భార్యాభర్తలు.. నేరుగా బంధువుల పెద్దకర్మకు

Lockdown in Karimnagar: తెలంగాణలో గురువారం మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉండడం గమనార్హం. అది కూడా వారిద్దరూ భార్యాభర్తలు. ఈ ఇద్దరు డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు.

Samayam Telugu 26 Mar 2020, 10:51 pm
కరీంనగర్‌లో హోం క్వారంటైన్ నుంచి ఇద్దరు దంపతులు బయటకు వచ్చారు. అంతేకాక, వారు నేరుగా అక్కడి నుంచి దంపతుల పెద్దకర్మకు వెళ్లారు. ఈ నెల 7న వీరు అమెరికా నుంచి కరీంనగర్‌కు వచ్చారు. అధికారుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో దంపతులు ఉన్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఇంట్లో ఉండకుండా జగిత్యాలలోని బంధువుల ఇంట్లో సంవత్సరీకానికి హాజరయ్యారు. వారి చేతులకు క్వారంటైన్ ముద్ర ఉండడంతో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు వారిని కేంద్రానికి తరలించారు. అప్రమత్తమైన జగిత్యాల ఆర్డీవో నరేందర్, సీఐ జయేశ్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu coronavirus mancherial


తెలంగాణలో గురువారం మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉండడం గమనార్హం. అది కూడా వారిద్దరూ భార్యాభర్తలు. ఈ ఇద్దరు డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. వీరు దోమల్‌గూడ ప్రాంతంలో నివస్తున్నారు. వీరికి కరోనా పాజిటివ్ అని తెలియగానే స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. కరోనా బారిన పడ్డ మరో వ్యక్తి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందినవారు. ఆయన ఇటీవలే దిల్లీ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

Must Read: పోర్న్ సైట్లకు పెరిగిన గిరాకీ.. అదును చూసి ఆఫర్లు

తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 44కు చేరినట్లయింది. మరోవైపు ఏపీలో10 మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇక భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 649కి చేరింది. వీరిలో మొత్తం 43 మంది కోలుకోగా, 13 మంది చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.