తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పొరుగున ఉన్న ఆంధ్రాతో పోలిస్తే కేసుల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ టెస్టులు కూడా తక్కువగానే జరుగుతున్నాయి. కాగా సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2.84 లక్షల నుంచి 9.66 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఏఎస్సీఐ-ఫిక్కీ అధ్యయనం అంచనా వేసింది.
కేసులు పెరుగుతున్న తీరు ఆధారంగా రెండు విధాలుగా మ్యాథమెటికల్ ప్రొజెక్షన్స్ రూపొందించారు. తెలంగాణ ఇప్పటిలాగే కేసులు పెరిగితే సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2.84 లక్షలకు చేరుతుంది. రోజుకు 18 మంది చొప్పున మరణిస్తారు. మరో అంచనా ప్రకారం.. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య ఊహకు అందని విధంగా పెరిగి 9.66 లక్షల మంది కరోనా బారిన పడతారు. రోజుకు 83 మంది ప్రాణాలు కోల్పోతారు.
జూన్ 21 నుంచి జులై 24 వరకు డేటాను పరిశీలించి.. దాని ఆధారంగా సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయమై అంచనాకు వచ్చామని ఏఎస్ఐసీ సెంటర్ ఫర్ హెల్త్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ సస్వత్ మిశ్రా తెలిపారు. కేసుల అంచనా కోసం మల్టిపుల్ లినియర్ రిగ్రెషన్ మోడల్ను ఉపయోగించామన్నారు.
సెప్టెంబర్ చివరి నుంచి నవంబర్ వరకు దేశంలో కరోనా ఉచ్ఛ స్థితికి చేరుకుంటుందనే అంచనాల నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీని ఎంచుకున్నామని మిశ్రా తెలిపారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. నిజం కావొచ్చు, కాకపోవచ్చు కానీ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రయివేట్ హాస్పిటళ్ల వరకు హెల్త్కేర్ మెకానిజాన్ని మెరుగుపర్చాలని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబోధ్ కందముథన్ తెలిపారు.
Read Also: కొత్త సచివాలయ డిజైన్.. కేసీఆర్ తొలి విదేశీ పర్యటనతో లింక్
ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోనూ ఉంచాలని.. సారి, ఐఎల్ఐ లాంటి కేసుల వివరాలను కూడా రిలీజ్ చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Must Read: తెలంగాణ కరోనా బులిటెన్.. ఒక్కరోజే 2207 కేసులు
కేసులు పెరుగుతున్న తీరు ఆధారంగా రెండు విధాలుగా మ్యాథమెటికల్ ప్రొజెక్షన్స్ రూపొందించారు. తెలంగాణ ఇప్పటిలాగే కేసులు పెరిగితే సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2.84 లక్షలకు చేరుతుంది. రోజుకు 18 మంది చొప్పున మరణిస్తారు. మరో అంచనా ప్రకారం.. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య ఊహకు అందని విధంగా పెరిగి 9.66 లక్షల మంది కరోనా బారిన పడతారు. రోజుకు 83 మంది ప్రాణాలు కోల్పోతారు.
జూన్ 21 నుంచి జులై 24 వరకు డేటాను పరిశీలించి.. దాని ఆధారంగా సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయమై అంచనాకు వచ్చామని ఏఎస్ఐసీ సెంటర్ ఫర్ హెల్త్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ సస్వత్ మిశ్రా తెలిపారు. కేసుల అంచనా కోసం మల్టిపుల్ లినియర్ రిగ్రెషన్ మోడల్ను ఉపయోగించామన్నారు.
సెప్టెంబర్ చివరి నుంచి నవంబర్ వరకు దేశంలో కరోనా ఉచ్ఛ స్థితికి చేరుకుంటుందనే అంచనాల నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీని ఎంచుకున్నామని మిశ్రా తెలిపారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. నిజం కావొచ్చు, కాకపోవచ్చు కానీ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రయివేట్ హాస్పిటళ్ల వరకు హెల్త్కేర్ మెకానిజాన్ని మెరుగుపర్చాలని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబోధ్ కందముథన్ తెలిపారు.
Read Also: కొత్త సచివాలయ డిజైన్.. కేసీఆర్ తొలి విదేశీ పర్యటనతో లింక్
ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోనూ ఉంచాలని.. సారి, ఐఎల్ఐ లాంటి కేసుల వివరాలను కూడా రిలీజ్ చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Must Read: తెలంగాణ కరోనా బులిటెన్.. ఒక్కరోజే 2207 కేసులు