యాప్నగరం

చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ప్రశ్నల వర్షం.. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం

తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వడం కోసం చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ హైకోర్టు ముందు హాజరయ్యారు.

Samayam Telugu 28 Jul 2020, 2:25 pm
కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించడానికి సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ టెస్టులు చేస్తున్నారని గుర్తు చేసింది. హెల్త్ బులిటెన్‌లో తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యాలు లేక, ఆక్సిజన్ అందక 8 మంది చనిపోయిన విషయాన్ని ప్రభుత్వ అధికారుల ముందు ఉంచింది.
Samayam Telugu court
Representative Image


ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లోనూ కరోనా వైరస్ ప్రభావంతో జనం చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయని హైకోర్టు తెలిపింది. వైరస్ పట్ల వారికి అవగాహన కల్పిస్తున్న తీరుపై ఆరా తీసింది. తమ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అడిగింది.

కరోనా విషయమై తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు గతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్త్ బులిటెన్ విషయంలోనూ ప్రశ్నలు సంధించింది. తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్ చీఫ్ సెక్రటరీని విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఆయనతోపాటు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా హాజరయ్యారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.