యాప్నగరం

హైదరాబాద్‌లో విషాదం.. కరోనా సోకిందనే భయంతో వృద్ధ జంట ఆత్మహత్య

గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు తమకు కరోనా సోకిందేమోనని ఆందోళన చెందారు. తమ వల్ల కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 1 Aug 2020, 4:45 pm
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న దంపతులు కూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి సూసైడ్ చేసుకున్నారు. తమకు కోవిడ్ సోకిందని.. తమ నుంచి ఇతర కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందనే భయంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.
Samayam Telugu నమూనాచిత్రం


మృతులను యాదమ్మ వెంటకటేశ్వర్ నాయడు (65), ఆయన భార్య వై. వెంకటలక్ష్మీ (60)గా గుర్తించారు. వీరు రాజ్‌భవన్ సమీపంలోని ఎంఎస్ మక్తాలో ఉన్న రాజ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వర్ నాయుడు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పని చేసి రిటైరయ్యారు.

వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడిందనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.