యాప్నగరం

కరోనా రోగికి ఒకే కాన్పులో ముగ్గురు జననం.. అరుదైన ఘటన

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామానికి చెందిన గర్భిణి గత నెల 21న అనారోగ్యంతో జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం వచ్చింది.

Samayam Telugu 4 Nov 2020, 10:57 pm
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ పేషంట్ ఒకే కాన్పులో ఏకంగా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ పిల్లలు కాగా, మరొకరు ఆడ శిశువు కావడం విశేషం. కరోనా పాజిటివ్‌ వచ్చిన గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను వైద్యులు క్షేమంగా కాపాడారు. ఈ ఘనత నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి వైద్యులకు దక్కింది. బుధవారం సాయంత్రం ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ ప్రతీమ్‌రాజ్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
covid patient delivery


నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామానికి చెందిన గర్భిణి గత నెల 21న అనారోగ్యంతో జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం వచ్చింది. అక్కడ పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించడంతో ఈనెల 22న ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి ఉమ్మనీరు తగ్గినట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు గుర్తించారు. కొవిడ్‌ సోకి ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పెద్దాపరేషన్ చేశారు.

దీంతో మహిళ ఇద్దరు మగశిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు 1.2 కేజీలు, మరొకరు 1.5 కేజీలతో జన్మించారు. తక్కువ బరువు ఉండడంతో శిశువులకు వైద్యులు ప్రత్యేక వైద్యం అందించారు. శిశువులకు మాత్రం కరోనా నెగటివ్‌గా తేలింది. తల్లికి కూడా నెగటివ్‌ రావడంతో అందర్నీ ఇంటికి పంపించారు.

Also Read: హైదరాబాద్‌లో ఫ్రీ షాపింగ్.. ఏం కావాలన్నా ఇలా తీసుకెళ్లొచ్చు! కానీ..

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.