యాప్నగరం

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కెమికల్ నీళ్లు తాగి ఆవు మృతి

యజమాని రూ.80వేలు ఇచ్చి ఆవును కొనుగోలు చేశారు. అయితే ఆవును కొని ఇంటికి తెచ్చిన నెలరోజులకే ఆవు మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Samayam Telugu 8 Oct 2020, 2:06 pm
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక ఆవు కెమికల్ నీళ్లు త్రాగి మృతి చెందింది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలంలోని రంగంపల్లి గ్రామానికి చెందిన శివలింగం అనే రైతు ఆవు కెమికల్ నీళ్లు త్రాగి మృతి చెందింది ఈ రైతు ఆవును నెల రోజుల క్రితం
Samayam Telugu కలుషిత నీరు తాగి ఆగి ఆవు మృతి
cow death

సుమారు 80వేల రూపాయలు వెచ్చించి తెచ్చుకున్నాడు. నెల రోజులకె ఆవు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అయితే అక్కడి ప్రాంతంలో గత కొంతకాలంగా చుట్టూ ప్రక్కల పరిశ్రమలు రసాయనలను వదులుతున్నాయి. దీంతో ఆ కెమికల్స్ కలిసే నీళ్లు తాగి ఎన్నో మూగ జీవులు మృత్యువాత పడుతున్నాయి. అయితే అధికారుల్లో మాత్రం ఏ చలనం లేకుండా పోయింది. అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.