యాప్నగరం

దారుణం.. అడవులో ఆవు కాల్చివేత

అడవుల్లో కాల్పులు జరిగాయి. వన్యప్రాణులతో పాటు పశువులు మేకలపై కూడా దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఓ ఆవు మృతి చెందింది.

Samayam Telugu 24 Oct 2020, 8:16 pm
అడవులో కాల్పుల మోత మోగింది. నోరులేని మూగజీవాలని కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా, పూడూర్ మండలం, దామగుండం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అడవుల్లో వేటగాళ్లు తుపాకులతో హల్‌చల్ చేశారు. వన్యప్రాణులతో పాటు పశువులు, మేకలను వెంటాడి వేటాడి చంపారు. అడవుల్లో కాల్పుల మోత విన్న కొందరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులను చూసి దుండగులు పరార్ అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వేటగాళ్ల కోసం గాలింపు చేపట్టారు.
Samayam Telugu కాల్పుల్లో ఆవు మృతి
cow death in vikarabad forest


Read More: She Teams: తెలంగాణ మహిళ ధైర్యం.. దేశంలోనే ప్రత్యేకం

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ పోలీసులు...దామగుండం సంఘటనపై అన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
పగలు రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో ఆవును కాల్చి చంపినట్లు సమాచారం.
ఆవుని కాల్చి చంపినట్టు సమాచారం. దీంతో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ జిల్లా DFO వేణు గోపాల్ మాధవ్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాన్ని చంపేందుకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.