యాప్నగరం

Dubbaka Election: కోటి హవాలా సొమ్ము ఆ అభ్యర్థివే.. అతని బామ్మరిది అరెస్టు: సీపీ

Dubbaka By Election: దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచార వేగం పెంచాయి.

Samayam Telugu 1 Nov 2020, 4:57 pm
హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో పట్టుకున్న హవాలా సొమ్ముకు సంబంధించి ఇద్దరు వక్తులను అరెస్ట్‌ చేసినట్లు నగర కమిషనర్ అంజనీకుమార్‌ తెలిపారు. ఓ ఇన్నోవా కారుతో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు పట్టుకున్న నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావుదిగా గుర్తించినట్లు అంజనీ కుమార్ చెప్పారు. శ్రీనివాస్‌రావుతో పాటు కారు డ్రైవర్‌ రవి కుమార్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. బేగంపేట ఫ్లైఓవర్‌ సమీపంలో ఈ నగదును పట్టుకున్నట్లు తెలిపారు.
Samayam Telugu అంజనీ కుమార్
Anjani kumar


పట్టుబడ్డ వారి వద్ద ఉన్న ఫోన్‌లో కీలక సమాచారం ఆధారంగా హవాలా సొమ్ము ఎవరిదో గుర్తించినట్లు సీపీ తెలిపారు. ‘‘ఆ ఫోన్ కాల్‌ లిస్ట్‌లో రఘనందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్‌ ఫోన్‌ చేశాడు. ఈ నగదును విశాఖ ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు తీసుకెళుతున్నట్లు గుర్తించాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో ఉంటారు.’’ అని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచార వేగం పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలు ఈ నెల 3న జరగనున్న దృష్ట్యా పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.