యాప్నగరం

సీపీ సజ్జనార్ మంచి మనసుకి పోలీసులు ఫిదా

Cyberabad Police: వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో రోడ్డుపైకి ఒక వ్యక్తి రావడం చూసి సీపీ అతని దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి ఒక డయాలసిస్ పేషెంట్ అని తెలుసుకున్నారు.

Samayam Telugu 10 Apr 2020, 5:23 pm
కూకట్‌పల్లి వై జంక్షన్, జెఎన్టీయూ చౌరస్తాలో లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న ఆ సమయంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులను వారి ఎలాంటి అవసరాల కోసం బయటికి వచ్చారో తెలుసుకుంటున్నారు. అందులో సరైన కారణం లేకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారిపై కేసు నమోదు చేశారు.
Samayam Telugu sajja


ఇలా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో రోడ్డుపైకి ఒక వ్యక్తి రావడం చూసి సీపీ అతని దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి ఒక డయాలసిస్ పేషెంట్ అని తెలుసుకున్నారు. హాస్పిటల్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చానని ఆ వ్యక్తి తెలపడంతో సీపీ సజ్జనార్ స్వయంగా పోలీసు వాహనం ఇచ్చి అతనిని హాస్పిటల్‌కు పంపించారు. దీంతో ఆ వ్యక్తి సజ్జనార్ ఉదారతకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై పిడుగు.. తప్పిన ముప్పు

శుక్రవారం కూడా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. చింతల్‌, గాజులరామారం, దేవేంద్ర నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ను తీరును పరిశీలించారు. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయం, చింతల్‌లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు వద్ద పలు వాహనాలను తనిఖీ చేసి వాహనదారులకు పలు సూచనలు చేశారు. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో అధికారులతో సమావేశమై కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

Must Read: కండోమ్‌ల కొరత కలవరం.. లాక్‌డౌన్‌ వేళ విపరీత గిరాకీ, యూఎన్ సైతం ఆందోళన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.