యాప్నగరం

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

Hyderabad NIMS: కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ పదో తరగతి చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా ఉద్యోగం చేశారు.

Samayam Telugu 13 Oct 2020, 4:19 pm
సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూడా పని చేశారు. గుండా మల్లేష్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. మల్లేష్ మరణ వార్త విని సీపీఐ నేత నారాయణ గృహనిర్బంధం నుంచి బయటికొచ్చి నిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు.
Samayam Telugu గుండా మల్లేష్
gunda mallesh


కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ పదో తరగతి చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరి సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా కూడా వ్యవహరించారు.

సీనియర్‌ నేతలు డి.రాజా, నారాయణ.. రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డితో పాటు అజీజ్‌పాషా తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.