యాప్నగరం

ట్రంప్ రెండోరోజు పర్యటనను అడ్డుకుంటాం: నారాయణ

Mancherial: మెక్సికోలో ట్రంప్‌ గోడ కట్టినట్లు మోదీ కూడా ఇక్కడ గోడ కడుతున్నారని మండిపడ్డారు. భారత్‌కు లాభం చేస్తున్న ఇరాన్‌పై ట్రంప్‌ దాడులు చేస్తున్నాడని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయుల్ని హింసిస్తున్న ట్రంప్‌కు స్వాగతం పలకడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 24 Feb 2020, 11:26 pm
అమెరికాలోని ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు వచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ట్రంప్‌ను ఆయన ప్రపంచ ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఆయన ముందు మోకరిల్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. మంగళవారం రాష్ట్రపతి ట్రంప్‌కు ఇచ్చే విందుకు కేసీఆర్‌ వెళ్లొద్దని డిమాండ్ చేశారు. రేపు జరిగే ట్రంప్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.
Samayam Telugu Narayana


మెక్సికోలో ట్రంప్‌ గోడ కట్టినట్లు మోదీ కూడా ఇక్కడ గోడ కడుతున్నారని మండిపడ్డారు. భారత్‌కు లాభం చేస్తున్న ఇరాన్‌పై ట్రంప్‌ దాడులు చేస్తున్నాడని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయుల్ని హింసిస్తున్న ట్రంప్‌కు స్వాగతం పలకడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.

Must Read: ట్రంప్ పర్యటన: ఫైరింజన్లతో తాజ్‌మహల్‌కు స్నానం? 300 ఏళ్లలో తొలిసారి!

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర స్థాయి నిర్మాణ సదస్సు రెండో రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. అమెరికా రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆ భారాన్ని ఇతర దేశాలపై మోపడానికి ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చారని న్నారు. ‘ట్రంప్‌ పర్యటన ఎలా ఉందంటే.. మీ ఇంటికొస్తే ఏమిస్తావు.. మా ఇంటికి ఏమి తెస్తావ్‌’ అనేలా ఉందని ఎద్దేవా చేశారు.

Also Read: తాజ్‌‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు.. విజిటర్స్‌ బుక్‌లో ఏం రాశారంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.