యాప్నగరం

కరోనా శవాలతో కాసుల వేట! సహజ మరణాలపైనా ప్రభావం

Erragadda: గతంలో నగరంలోని కుటుంబంలో ఓ వ్యక్తి సహజ మరణం పొందితే అంత్యక్రియలకు రూ.15వేల లోపు ఖర్చు ఉండేది. ప్యాకేజీ రూపంలో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తే ఈ కార్యక్రమాలన్నీ ఏజెన్సీ నిర్వహకులే చూసుకునేవారు.

Samayam Telugu 9 Aug 2020, 11:26 am
మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గతంలో ఎన్నడూ చూడని అమానవీయ పరిస్థితుల్ని కలిగిస్తోంది. చనిపోయాక వ్యక్తులకు గౌరవప్రదంగా నిర్వహించే అంత్యక్రియలు కూడా తలదించుకొనే స్థాయిలో జరుగుతున్నాయి. రక్త సంబధీకులు సైతం దూరం కావడం, ముక్కూమొహం తెలియని వారి చేతిలో అమర్యాదకరంగా చివరి క్రతువు నిర్వహిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా కాలంలో అంతిమ సంస్కారం ఇప్పుడో పక్కా వ్యాపారమైపోయింది. కాసులు విదిల్చితే కానీ ఖననం లేదా దహనం కానివ్వబోమని శ్మశాన సిబ్బంది తేగేసి చెబుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona Cremation


కరోనా వైరస్‌తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలే కాదు సహజ మరణం పొందిన వారి దహనసంస్కారాలపైనా ఈ ప్రభావం అంతే పడుతోంది. గతంలో నగరంలోని కుటుంబంలో ఓ వ్యక్తి సహజ మరణం పొందితే అంత్యక్రియలకు రూ.15వేల లోపు ఖర్చు ఉండేది. ప్యాకేజీ రూపంలో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తే ఈ కార్యక్రమాలన్నీ ఏజెన్సీ నిర్వహకులే చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ప్యాకేజీ ధరను ఏకంగా రూ.25 వేలు దాటుతోంది.

కోవిడ్‌ మరణమైతే మరీ దారుణం..
కరోనా వైరస్‌‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలను జీహెచ్‌ఎంసీయే నిర్వహిస్తోంది. దీనికి ఎలాంటి చెల్లింపులు చేయొద్దని నిబంధనలు ఉన్నా శ్మశానవాటికలో నిర్వహకులు మాత్రం పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. చితిపైకి మృతదేహాన్ని చేర్చిన తర్వాత ముఖాన్ని చూపించిన అనంతరం కుటుంబ సభ్యుల నుంచి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నిర్వహకులు పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఫిర్యాదుల విభాగానికి కాల్స్ వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.