యాప్నగరం

‌కామారెడ్డి ఆర్డీఓ నరేందర్‌పై వేటు.. ఆదేశాలు జారీచేసిన తెలంగాణ సీఎస్

రెవెన్యూ శాఖలో అవినీతి చేపల్ని పట్టుకునే పనిలో పడింది ఏసీబీ. ఒక్కొక్క అవినీతి అధిాకారుల్ని ఏరివేతపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పెద్ద పెద్ద తిమింగళాల్ని పట్టుకున్నారు.

Samayam Telugu 16 Sep 2020, 8:30 am
తెలంగాణలో రెవెన్యూ శాఖపై ఏసీపీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద తిమింగళాల్ని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాజాగా రూ. కోటి 12 లక్షలు లంచం డిమాండ్‌ చేసి అవినీతి శాఖకు చిక్కిన మెదక్‌ అదనపు కలెక్టర్ నగేశ్‌ ఉదంతం మరిచిపోకముందే.. రెవెన్యూ శాఖలో మరో బాగోతం వెలుగుచూసింది. మెదక్ ఉమ్మడి జిల్లాలో గతంలో జరిగిన భూదందాలో కీలకంగా వ్యవహరించిన ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ నరేందర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.
Samayam Telugu కామారెడ్డి ఆర్డీఓ సస్పెన్షన్
kamareddy rdo suspension


Read More: హైదరాబాద్ మళ్లీ నంబర్ వన్.. ఏపీ మంత్రి ట్వీట్, థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో తహసీల్దారుగా నరేందర్ పనిచేసిన సమయంలో... దస్త్రాలను మార్చి ఖాజీపల్లిలోని కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి అక్రమంగా కట్టబెట్టిన వ్యవహారంలో... నరేందర్‌ ప్రమేయం ఉందని తేలింది. ఆ నివేదిక ఆధారంగా సీఎస్ సోమేశ్ కుమార్ వేటు విధిస్తూ‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిన్నారం మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన కె. నారాయణనూ కూడా సస్పెండ్‌ చేశారు. మొత్తానికి అవినీతి అధికారులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెవెన్యూ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎక్కడ ఎవరి ఉద్యోగం ఎప్పుడూ ఊడుతుందో తెలియక అనేకమంది భయాందోళనల్లో బతుకుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.