యాప్నగరం

గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. రాష్ట్రం మొత్తం కర్ఫ్యూనే.. : కేసీఆర్

Telangana Lockdown Extension: పగటి సమయంలో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

Samayam Telugu 6 May 2020, 12:11 am
తెలంగాణలో గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ పొడిగించిన మే 29 తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Samayam Telugu ప్రగతి భవన్: విలేకరుల సమావేశం‌లో సీఎం కేసీఆర్


అయితే.. పగటి సమయంలో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఆ షాపులు ఏమిటనేవి మున్సిపల్ కమిషనర్ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు. ఈ షాపులు సాయంత్రం 6 గంటలకల్లా కచ్చితంగా మూసేయాల్సి ఉంటుందని చెప్పారు.

Also Read: undefined

కరోనాను నిర్మూలించేందుకు లాక్ డౌన్‌ను పొడిగించాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరిస్తూ.. ‘‘కరోనా వైరస్‌ను నమ్మడానికి వీల్లేదు. ప్రజలు తమకు తామే స్వీయ నిర్భందం పాటించాలి. అమెరికాలో భారీగా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించి మనం విజయం సాధించాం. కరోనా కట్టడికి ఏకైక ఆయుధం లాక్ డౌన్. మనం ఇలాగే కొన్ని రోజులు నిర్బంధంలో ఉంటే పూర్తిగా విముక్తులవుతాం.’’ అని కేసీఆర్ చెప్పారు.

Must Read: పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ కీలక ప్రకటనAlso Read: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు.. కేసీఆర్ సంచలన ప్రకటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.