యాప్నగరం

అధిక కరెంటు బిల్లులు.. మెదక్‌లో అధికారుల్ని కట్టేసి గ్రామస్థుల ప్రతాపం

Medak: ఈ కరెంట్‌ బిల్లులు చూసి తీవ్ర ఆగ్రహం చెందిన మెదక్‌ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్‌ గ్రామవాసులు విద్యుత్‌ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు.

Samayam Telugu 18 Jul 2020, 8:15 pm
రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన తర్వాతి నుంచి ఎక్కువగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ఎప్పుడూ రూ.వందల్లో వచ్చే కరెంటు బిల్లు రూ.లక్షల్లో కూడా వచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. దీనిపై ప్రజలు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొంత మంది ఏకంగా విద్యుత్ అధికారులతో గొడవ పెట్టుకున్నారు. తాజాగా ఈ కరెంట్‌ బిల్లులు చూసి తీవ్ర ఆగ్రహం చెందిన మెదక్‌ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్‌ గ్రామవాసులు విద్యుత్‌ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు. కరెంటు బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను పట్టుకుని గ్రామస్థులు ఏకంగా స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చేంతవరకు వారిని విడిచిపెట్టేది లేదని తేగేసి చెప్పారు.
Samayam Telugu అధికారులను కట్టేసిన గ్రామస్థులు
Power bills


Also Read: undefined

గత రెండు నెలలుగా అధిక విద్యుత్‌ బిల్లులు, కరెంటు కోతలు వంటి సమస్యలతో తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని గ్రామస్థులు తెలిపారు. వీటి గురించి అధికారులకు చెప్పిన వారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విసుగు చెందిన గ్రామస్థులు తమ ఊరికి వచ్చిన విద్యుత్ అధికారులను తాళ్లతో కట్టేసి ఇలా నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రోజులకు రోజులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, అధిక కరెంటు బిల్లులు వసూళ్ల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే వాడే లేడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Must Read: ఆకాశంలో గ్రహాలు చూడాలా.. అరుదైన అవకాశం ఇవాళే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.