యాప్నగరం

Cyber Attack: మిధాని సంస్థపై సైబ‌ర్ అటాక్‌.. 40 లక్షలు స్వాహా

Cyber Attack: సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలటం లేదు. అమాయకుల దగ్గరి నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు అందరినీ దోచుకుంటున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో.. మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ మిధాని సంస్థ మెయిల్ ఐడీని హ్యాక్ చేసి.. ఏకంగా 40 లక్షలు కాజేశారు. ఆలస్యంగా ఈ విషయం గ్రహించిన మిధాని సంస్థ.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Sep 2022, 10:28 am
Cyber Attack: సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్లు (Cyber Fraudsters) రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో.. వినూత్న పద్ధతుల్లో మోసాలకు తెరలేపుతున్నారు. దొరికిన ఏ దారినీ వదలకుండా.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదే క్రమంలో మిధాని సంస్థ (Midhani Company) కు ఏకంగా 40 లక్షల టోకరా వేశారు. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని మిధాని సంస్థ కెనడాకు చెందిన నేచురల్ ఆలూ కంపెనీ దగ్గర నుంచి అల్యూమినియం కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో.. కెనడా కంపెనీకి మిధాని సంస్థ కొంత నగదును అడ్వాన్స్‌గా చెల్లించింది. ఒప్పందం ప్రకారం మిధాని సంస్థకు నేచురల్ ఆలూ కంపెనీ తగినంత అల్యూమినియం అందించింది.
Samayam Telugu MIdhani
మిధాని సంస్థపై సైబ‌ర్ అటాక్‌


ఇదే అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్లు కెనడా సంస్థ పేరు మీద నకిలీ ఐడీని తయారు చేశారు. అమెరికాకు చెందిన అకౌంట్ నెంబర్‌ను మెయిల్ ద్వారా మిధాని సంస్థకు పంపించారు. అది గుర్తించని మిధాని సంస్థ.. మొయిల్‌లో పంపించిన అకౌంట్‌కు మిగత బ్యాలెన్స్ అమౌంట్ 40 లక్షలు పంపించింది. కొన్ని రోజులకు.. నేచురల్ ఆలు కంపెనీ ప్రతినిధులు మిధానీ సంస్థను మిగతా బ్యాలన్స్ పంపించాలని కోరడంతో పంపించామని తెలిపారు. తమకెలాంటి నగదు రాలేదని కెనడా సంస్థ తెలపటంతో.. సైబర్ నేరగాళ్ల మోసం బయటపడింది. వెంటనే మిధాని సంస్ధ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.