యాప్నగరం

షాకింగ్.. అంబులెన్స్‌లో ప్రయాణికుల తరలింపు! పట్టుబడితే అంతే: సజ్జనార్

Sajjanar: ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలు మూసివేయాలని సూచించారు. ఒకవేళ నిబంధనలు బేఖాతరు చేస్తే కేసులు పెట్టడం తప్పదని సీపీ హెచ్చరించారు. సామాజిక దూరం నిబందన ఉల్లంఘించినా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Samayam Telugu 23 Mar 2020, 4:34 pm
రాష్ట్ర ప్రజలంతా ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాల్సిందేనని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు చేశారు. ప్రజలు ఎవరూ బయట తిరగవద్దని సూచించారు. సోమవారం సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలెవరూ బయట తిరగకూడదని, ఒకవేళ నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా రవాణా పని చేయనందున క్యాబ్‌లు, ట్యాక్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని బుక్‌ చేసుకోవద్దని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబులెన్స్‌ల్లో జనాలను తరలించిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, అలా చేసిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Samayam Telugu V C Sajjanar


Must Read: లాక్‌డౌన్: కలెక్టర్ తీవ్రస్థాయిలో ఫైర్.. రోడ్డుపైనే కార్లు, బైక్‌లు లాక్కొని..

ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలు మూసివేయాలని సూచించారు. ఒకవేళ నిబంధనలు బేఖాతరు చేస్తే కేసులు పెట్టడం తప్పదని సీపీ హెచ్చరించారు. సామాజిక దూరం నిబందన ఉల్లంఘించినా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశామని, పిల్లల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లకే పరిమితం చేయాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడవద్దని, కిరాణా దుకాణాలకు వెళ్లే సమయం ఉదయమే ఉండాలని సూచించారు. ఏ షాపులైనా సరే సాయంత్రం 7 నుంచి మూసివేయాలని చెప్పారు. ఫుడ్‌ డెలివరీ ఆర్డర్లు కూడా సాయంత్రం 6 లోపే మూసివేయాలని నిర్దేశించారు. ప్రజలు ప్రయాణాలు విధిగా మానుకోవాలని సజ్జనార్ సూచించారు.

Also Read: గల్ఫ్ నుంచి తెలంగాణలోకి 36 మంది.. వెనక్కు పంపిన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.