యాప్నగరం

యువతిపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం

బంధువుల అమ్మాయి ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాదు ఆ యువతిపై అసభ్యకర ప్రచారం చేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు.

Samayam Telugu 19 Sep 2020, 9:14 am
సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలు, మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు కొందరు అమ్మాయి ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వారి పట్ల అసభ్యకర ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనలతో అనేకమంది అమ్మాయిలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కొందరు అయితే ఈ వేేధింపుల్ని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకర ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Samayam Telugu సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం
social media


అయితే ఈ ఘటనకు పాల్పడింది బయట వ్యక్తులు ఎవరో కాదు.. స్వయంగా యువతికి తెలిసిన సమీప బంధువే. ఈ విషయం తెలిసి బాధితురాలి కుటుంబం సైతం షాక్‌కు గురయ్యింది. సమీప బంధువైన వ్యక్తి యువతి ఫొటోలు సేకరించి సోషల్‌మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న వ్యక్తిని సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో ఓ యువతి ఫొటోలు పెట్టి, అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న యువతి సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read More: ఎంపీ అసద్ కుమార్తె వివాహం.. అత్యంత సన్నిహితులకే ఆహ్వానం

రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ ప్రారంభించారు. యువతికి సమీప బంధువు అయిన ఖైరతాబాద్‌ ప్రాంతానికి చెందిన కేశవరెడ్డి అనే వ్యక్తి, యువతి గురించి అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నాడని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమ్మాయిలు ఎవరూ తమ వ్యక్తిగత ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయోద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.