యాప్నగరం

తక్కువ ధరకే విల్లాలట.. ఇలాంటి ట్రాప్‌లో మాత్రం పడకండి!

తక్కువ ధరకే విల్లాలు అమ్ముతామంటూ నమ్మించి చేసిన ఘరానా మోసం సంచలనం రేపుతోంది. దమరి ఎస్టేట్స్ పేరుతో ఈ దందా సాగించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గ్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో బండారం మొత్తం బయట పడింది. ఈ మోసానికి సూత్రధారి అయిన వ్యక్తిని శుక్రవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

Samayam Telugu 21 Feb 2020, 7:45 pm
తక్కువ ధరకే విల్లాలు అమ్ముతామంటూ నమ్మించి చేసిన ఘరానా మోసం సంచలనం రేపుతోంది. దమరి ఎస్టేట్స్ పేరుతో ఈ దందా సాగించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గ్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో బండారం మొత్తం బయట పడింది. ఈ మోసానికి సూత్రధారి అయిన వ్యక్తిని శుక్రవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
Samayam Telugu damari estates owner suman arrests by panjagutta police
తక్కువ ధరకే విల్లాలట.. ఇలాంటి ట్రాప్‌లో మాత్రం పడకండి!


పంజాగుట్టలో ఆఫీసు

పంజాగుట్ట ఎస్సై సతీష్ కుమార్ కథనం మేరకు... అనంతపురం జిల్లా రాయదుర్గ్ గ్రామానికి చెందిన సిడిగొందే అనిత ఈ ఫిర్యాదు చేశారు. దమరి ఎస్టేట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ సుమన్ మీడియాస్ పేరుతో చెర్వుపల్లి సుమన్ అలియాస్ సుమన్ బాబు అనే వ్యక్తి పంజాగుట్టలోని ద్వారాకపురి కాలనీలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ప్రముఖ టీవీ ఛానెల్స్, దిన పత్రికలలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి తక్కువ ధరకే కమ్మదానం విలేజ్ ఫారూఖ్ నగర్ మండలంలో విల్లాలు నిర్మించి ఇస్తామని ప్రేక్షకులను నమ్మించాడు. అ యాడ్స్ చూసి నమ్మి ఆఫీస్‌కు వచ్చిన బాధితురాలు రెండు విల్లాలు బుక్ చేసుకుంది.

రూ.29 లక్షలకే విల్లా..!

ఒక్కోవిల్లాకు రూ.29 లక్షల చొప్పున 2 విల్లాలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.14 లక్షల రూపాయలు బ్యాంకు అకౌంట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. 10 రోజుల్లోనే విల్లా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఇంతవరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. రేపు, రేపు అని దాటవేస్తూ కాలయాపన చేస్తుండగా మోసపోయామని గ్రహించింది. ద్వారాకపురిలోని ఆఫీసుకు వెళ్లగా అక్కడినుంచి ఆఫీస్‌ను అమీర్‌పేట్‌లోని సిరి ఎస్టేట్స్‌కు తరలించినట్టుగా తెలిసింది. ఇలా విల్లాల పేరుతో చాలా మందిని మోసం చేసినట్టుగా తెలిసింది.

Also Read: కోమటిరెడ్డికి అమెరికాలో కీలక పదవి.. నామినేట్ చేసిన ట్రంప్

ఫేక్ బ్రోచర్లు, ప్రకటనలు

ఎలాంటి ల్యాండ్ లేకున్నా ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుంచి డెవలప్‌మెంట్ పేరుతో కొంత మొత్తం అడ్వాన్స్ చెల్లించి అక్కడ ఎలాంటి వెంచర్ డెవలప్ చెయకున్నా పేపర్ యాడ్స్ వేసి, వెంచర్ బ్రోచర్‌లు ప్రింట్ చేసి, అమాయకులను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా బయటపడింది. గ్రీన్ ల్యాండ్, శివ పార్వతి డైమండ్ స్పేస్ లాంటి పేర్లతో వెంచర్స్ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాట్టుగా పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన చేరువుపల్లి సుమన్‌ను శుక్రవారం అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇతని వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో సంప్రదించవచ్చని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.

Must Read: ఎగిరే వైట్ హౌజ్ ఎయిర్ ఫోర్స్ వన్.. ఆశ్చర్యపర్చే నిజాలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.