యాప్నగరం

భద్రాద్రి, యాదాద్రి ఆలయాల్లో దర్శనాలు షురూ..

కరోనా వైరస్ కారణంగాా దేవాలయాల్లోకి భక్తుల ప్రవేశంపై రెండు నెలలకుపైగా ఆంక్షలు కొనసాగగా.. ఆంక్షల సడలింపులో భాగంగా నేటి (జూన్ 8) నుంచి ఆలయాల్లోకి భక్తుల ప్రవేశానికి అనుమతి ఇస్తున్నారు.

Samayam Telugu 8 Jun 2020, 11:44 am
లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో నేటి (జూన్ 8) నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన భద్రాద్రి, యాదాద్రి, వేములవాడల్లో భక్తుల ప్రవేశానికి అనుమతి ఇస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేపట్టిన తర్వాతే భక్తులను ఆయలంలోకి అనుమతి ఇస్తున్నారు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులను ఆలయాల్లోకి అనుమతించడం లేదు. ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు భద్రాచలం రామాలయంలోకి భక్తులను అనుమతించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రసాదాలను నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందిస్తున్నారు.
Samayam Telugu రామాలయం
bhadrachalam ramalayam


భౌతిక దూరం పాటించడంతోపాటు తీర్థం ఇవ్వడం, శఠగోపం పెట్టడం లాంటి వాటికి కొద్ది రోజులపాటు దూరంగా ఉండనున్నారు. ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయంలో తొలి రోజు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టను మాత్రం తాత్కాలికంగా మూసివేశారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకొని రావాలని సూచించారు. కొండపైకి బస్సులు, ఆటోలు, టూవీలర్లను మాత్రమే అనుమతిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.