యాప్నగరం

మరో విషాదం.. నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత

Hyderaad: నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట కరోనా బారినపడ్డ దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. రోజుల వ్యవధిలోనే ఇద్దరూ కన్నుమూశారు.

Samayam Telugu 26 Oct 2020, 8:54 pm
మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి అహల్య (68) కూడా కన్నుమూశారు. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న అహల్య సోమవారం (అక్టోబర్ 26) సాయంత్రం హాస్పిటల్‌తో తుదిశ్వాస విడిచారు. కరోనా పాజిటివ్ రావటంతో నాయిని నర్సింహారెడ్డితో పాటే ఆమె హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నాయిని నర్సింహారెడ్డి అక్టోబర్ 22న కన్నుమూశారు. అహల్యకు కరోనా నెగటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం సాయంత్రం కన్నుమూశారు.
Samayam Telugu నాయిని నర్సింహారెడ్డి దంపతులు
Nayani Narsimha Reddy Couple


భర్త నాయిని నర్సింహారెడ్డి ఆఖరి చూపునకు అహల్యను కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. నాలుగు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడంతో నాయిని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

నాయిని అంత్యక్రియలో సమయంలో వీల్‌చైర్‌లో అహల్య:

Nayani Narsimha Reddy wife


Also Read: మహదేవ్‌పూర్: యువతి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య

Must Read: అదే వాన, అంతే బీభత్సం.. ఈసారి బెంగళూరులో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.