యాప్నగరం

టాలీవుడ్ ప్రముఖ హీరో పొలంలో మృతదేహం

టాలీవుడ్ హీరో పొలంలో మృతదేహం లభించడం కలకలానికి దారితీసింది. ఆ మృతదేహం ఎవరిది? వ్యవసాయ క్షేత్రంలో ఏం జరిగింది? అనేది తెలియాల్సి ఉంది.

Samayam Telugu 18 Sep 2019, 11:27 pm
టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో పొలంలో మృతదేహం లభ్యమవడం కలకలానికి కారణమైంది. షాద్ నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని పాపిరెడ్డి గూడలో సదరు హీరో ఇటీవలే 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఇంతలో ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఓ పాడుబడ్డ గదిలో కుళ్లిన స్థితిలో మృతదేహం బయటపడింది.
Samayam Telugu Representional Image


హీరో సతీమణి సెప్టెంబర్ 10న ఆ వ్యవసాయ క్షేత్రంలో చెట్టు నాటారు. అక్కడ సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించాలనే ఉద్దేశంతో హీరో కుంటుంబం ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.

Must Read: ఉత్తమ్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి.. రేవంత్ రెడ్డి ఫిర్యాదు

సేద్యం పనుల్లో భాగంగా వ్యవసాయ క్షేత్రానికి ఇటీవల కొంత మందిని పంపించారు. వారు వ్యవసాయ క్షేత్రాన్ని కలియతిరిగి పరిశీలిస్తుండగా.. అక్కడి ఓ గదిలో కుల్లిపోయిన శవం కనిపించింది. వెంటనే కేశంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Don't Miss: ఇళ్లు తగలబెట్టిన ఎలుక..

మృతదేహం ఉన్న గదిని పోలీసులు సీజ్ చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. గురువారం (సెప్టెంబర్ 19) ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో మరోసారి పరిశీలించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.