యాప్నగరం

అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. వెెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా

దింపుడు కల్లం వద్ద వెళ్లగానే బంధువులు ఏడుస్తూ పిలవడంతో ఆమె మూలిగింది. దీంతో వెంటనే యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందన్నారు డాక్టర్లు.

Samayam Telugu 15 Oct 2020, 7:07 am
ఓ యువతీ బతికుండగానే చనిపోయిందని కున్నారు. దీంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు మోసుకెళ్లారు. ఇంతలో దింపుడుకల్లం వద్ద బంధువులు ఏడుస్తూ పిలవడంతో ఆమె మూలిగింది. దీంతో కుటుంబసభ్యులంతా ఆనందంతో బతికే ఉందని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆమె చనిపోయింది. ఈ దుర్ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu చనిపోయి బతికిన యువతి


మహదేవపూర్‌ మండలం కుదురుపల్లికి చెందిన మెండ లక్ష్మీ-లక్ష్మయ్యల కూతురు గీతాంజలి(20) మహదేవపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువు తున్నది. 20 రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. దీంతో ఆమెకు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడితో చికిత్స చేయిస్తున్నారు. జ్వరంతోనే వ్యవసాయ పనులకూ వెళ్తున్నది. దీంతో ఆరోగ్యం క్షీణించి బుధవారం చలనం లేకుండా పోయింది. కుటుంబసభ్యులు ఆమె చని పోయిందనుకుని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో దింపుడుకల్లం వద్ద శవపేటికను దించారు.

Read More: మూసీకి ఎన్నడూ లేనంత వరద.. డ్యామ్‌కు ప్రమాదం ఉందా?

కుటుంబసభ్యులు పిలవడంతో యువతి నుంచి మూలిగిన శబ్దం వచ్చింది. అవాక్కైన గ్రామస్థులు మహదేవపూర్‌ దవాఖానకు తరలించారు. అప్పటికే యువతి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించడంతో తిరిగి గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
బతుకుతుందనుకున్న యువతి ప్రాణాలు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.